82 మంది సలహాదారులు, చైర్మన్లపై అఖిలేష్ వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సలహాదారులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులలో ఉన్న 82 మందిని అఖిలేష్ యాదవ్ తొలగించారు. వీరందరూ సహాయ మంత్రి హోదా పదవుల్లో కొనసాగేవారు.
కాగా కొందరు సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లను పదవుల్లో కొనసాగించారు. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ దారుణ పరాజయం ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. అందులోభాగంగా వీరిపై వేటు వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.