'వాటర్ గ్రిడ్' పై అఖిలేష్ యాదవ్ ఆసక్తి


హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రక్షిత మంచి నీరు అందించాలన్న ప్రయత్నం..ఎంతో గొప్పదని ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకం పై ఆయన ఆసక్తి కనబరిచారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అఖిలేష్ యాదవ్ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. వాటర్ గ్రిడ్ పథకంకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కోరారు. ఈసందర్భంగా కేటీఆర్తో మాట్లాడుతూ యూపీకి రావాలని అఖిలేష్ యాదవ్ ఆహ్వానించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top