గ్యాస్ ట్యాంకర్ - ట్రక్ డీ : ఇద్దరు మృతి


నావి ముంబై: ముంబై - గోవా జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న  స్టీల్ రాడ్ల లోడ్తో వస్తున్న ట్రక్ ఢీ కొన్నాయి. దాంతో గ్యాస్ ట్యాంకర్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.


ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వాటిని మరో మార్గం లో మళ్లీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top