5, 8వ తరగతులకు డిటెన్షన్‌

5, 8వ తరగతులకు డిటెన్షన్‌ - Sakshi


కోల్‌కతా: పాఠశాలల్లో 5వ, 8వ తరగతుల విద్యార్థులకు త్వరలో రాష్ట్రాల సాయంతో డిటెన్షన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ‘ప్రతిపాదిత బిల్లు ఏటా మార్చి నెలలో ఈ తరగతుల వారికి పరీక్షలు నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకు అందిస్తుంది.



విద్యార్థులు మార్చి పరీక్షల్లో ఫెయిలైతే మే నెలలో వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ యత్నంలోనూ ఉత్తీర్ణులు కాకపోతే వారిని పైతరగతులకు వెళ్లనివ్వకుండా ఆ తరగతుల్లోనే ఉంచుతారు’ అని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల విద్యామంత్రులతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని, 25 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top