రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం - Sakshi


బెంగళూరు: ఆరేళ్ల బాలికపై స్కూల్‌లో అత్యాచార ఘటనను మరువక ముందే బెంగళూరులో మరో చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. రెండో తరగతి చదువుతున్న బాలిక(7)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  సుంకదకట్ట మొయిన్‌రోడ్డులోని శాంతిధామ స్కూల్లో ఓ బాలిక రెండో తరగతి చదువుతోంది.



బాలిక ఇంటిలో ఓ మహిళ పనిచేస్తూ వారి ఇంటిలోనే ఉంటోంది. ఈ నెల 27న  బాలికను ఇంటిలో వదిలి తల్లి బయటకు వెళ్లింది. తర్వాత పని మనిషి కూడా బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న పనిమనిషి కుమారుడు శ్రీనివాస్ (28) బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడితో పాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top