మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
బెంగళూరు: చాకెట్లు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. బెంగళూరుకు సమీపంలో బిదాడి గ్రామంలో గురువారం అమానుషం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో పొరుగున ఉండే అర్జున్ చాకెట్లను ఆశపెట్టి పాపను ఎత్తుకెళ్లి దుర్మార్గానికి ఒడిగట్టాడు. తర్వాత అక్కడినుంచి పారిపోయాడు.
మధ్నాహ్నం పని నుంచి తిరిగి వచ్చిన పాప తల్లిదండ్రులు చిన్నారి ఆరోగ్యం పరిస్థితి తేడాగా ఉండడాన్ని గమనించడంతో జరిగిన అన్యాయం వారికి అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా చిన్నారి తల్లిదండ్రులు రోజుకూలి చేసుకునే కార్మికులు. ఇంటికి సమీపంలోనే ఉన్న భవనంలో పనిచేస్తున్నారు.