తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్రేప్

తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్రేప్ - Sakshi


న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఐదుగురు దుండుగులు పదో తరగతి విద్యార్థిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరూ ఆ అమ్మాయికి తెలిసినవారే.



వారం రోజుల క్రితం బాధితురాలు స్కూల్కు వెళ్తున్న సమయంలో నిందితులు ఓ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. మొబైల్ ఫోన్లో వీడియా తీశారు. ఈ సంఘటన గురించి బయటకే చెప్పరాదంటూ తుపాకీతో ఆ అమ్మాయిని బెదిరించారు. బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తుపాకీ, ఫోన్ రికార్డును కూడా స్వాధీనం చేసుకోవాల్సివుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top