బరసత్లో బాలికపై సామూహిక అత్యాచారం
కీచకుల పరంపర కొనసాగుతోంది. మహిళలపై లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరిస్తున్న కీచకుల ఆగడాలు ఆగడం లేదు. నిర్భయ వంటి చట్టాలు వచ్చిన అత్యాచారాల కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
తాజాగా పశ్చిమబెంగాల్లోని పరగణాస్ జిల్లా దిగంగా ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లో చొరబడిన అగంతకులు ఆమెను బలవంతగా ఊరు బయటకు తీసుకవెళ్లి ఈ అగత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.
గ్రామం శివారున శుక్రవారం ఉదయం అపస్మారక స్థితిలో పడివున్న బాలికను గుర్తించినట్టు తెలిపారు. దీంతో బాలికను తొలుత చికిత్స నిమిత్తం దిగంగా ప్రైమరి హెల్త్ సెంటర్కు తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అవసరమని సూచించారు. దాంతో బాధితురాలని బరసత్ స్టేట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు