'శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడు'
న్యూఢిల్లీ: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాజనీతిజ్ఞుడు, మేధావి అని మోదీ కొనియాడారు.
దేశం కోసం ఆయన ఎంతో సేవ చేశారని, ప్రజల మనసులో గొప్ప నాయకుడిగా గుర్తుండిపోతారని మోదీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాభివృద్ధి కోసం శ్యాం ప్రసాద్ ముఖర్జీ నిరంతరం కృషి చేశారని చెప్పారు. శ్యాం ప్రసాద్ 1951లో జన సంఘ్ను స్థాపించారు.