ఉద్యోగుల దర్యాప్తుపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఉద్యోగులపై దర్యాప్తు అంశంపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. రిటైర్ అయిన తర్వాత కూడా విచారణ చేయాలని సుప్రీం కోర్టు తీర్పులో వెల్లడించింది.
ఉద్యోగి చేసిన తప్పులు, దాని వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని పదవీ విరమణ అనంతరం కూడా రికవరీ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రిటైర్ అయినంత మాత్రన శిక్ష నుంచి తప్పించుకోలేరని సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పులో పేర్కొన్నారు.