మీరట్ అగ్నిప్రమాదం విచారణకు ఏక సభ్య కమిషన్


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు గురువారం  మీరట్ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. మాజీ న్యాయమూర్తి ఎస్.బీ సిన్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను న్యాయస్థానం ఏర్పాటు చేసింది. 2006లో ఉత్తరప్రదేశ్లోని మీరట్ అగ్నిప్రమాదం ఘటనలో 60 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 


ఈ అగ్నిప్రమాద ఘటనపై 2015 జనవరి 31 లోగా కమిషన్ తన నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరోవైపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ సర్కారుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సూచించింది.  

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top