విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్

విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్ - Sakshi


మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రైతు ఆత్మహత్యల అంశాన్ని స్వయంగా పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.



ఈ కేసును తాము సుమోటోగా తీసుకుందామనుకున్నామని, అంతలోనే పిటిషన్ కూడా దాఖలైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు వ్యాఖ్యానించారు. తనకు తానుగా చితిని పేర్చుకుని మరణించిన 75 ఏళ్ల రైతుకు సంబంధించిన వార్తాకథనంపై సుప్రీం ధర్మాసనం స్పందించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top