ఉపాధ్యాయురాలి చెంపచెళ్లుమనిపించిన విద్యార్థి


 చెన్నై : చదువు చెప్పే గురువునే చెంప దెబ్బకొట్టాడో విద్యార్థి. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా నాంగునేరి ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.  పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సహ విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని తరగతిలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీశారు.



దానికి విద్యార్థి అభ్యంతరం తెలిపాడు.  అంతేకాకుండా ఆ విద్యార్థి ఉపాధ్యాయురాలితో వాదనకు దిగాడు. టీచర్‌నే ఎదిరిస్తావా? అంటూ సదరు ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థి చెంపపై ఓ దెబ్బ కొట్టింది. దీనికి వెంటనే ఆ విద్యార్థి ఎదురు తిరిగి ఉపాధ్యాయురాలి చెంపపై కొట్టాడు. ఆ ఉపాధ్యాయురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

**

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top