నోట్ల రద్దుకు ఎంతమంది మద్దతు ఇచ్చారో తెలుసా?
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన యాప్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ‘నరేంద్ర మోదీ’ యాప్ ద్వారా 10.20 లక్షల మందితో నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది మోదీ నిర్ణయం భేష్ అని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 684 జిల్లాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
90 శాతానికి పైగా మంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వగా.. రెండు శాతం మంది మాత్రం ఈ నిర్ణయానికి ‘వెరీ పూర్’ అని రేటింగ్ ఇచ్చారు. సర్వేల్లో పాల్గొన్న వారిలో 86 శాతం మంది ‘గతంలో అవినీతి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న వారు. ఇప్పుడు నల్లధనం బయటకు తీయటాన్ని వ్యతిరేకిస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు. నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థించిన వారందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.