ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం - Sakshi


న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమ బెంగాల్తో  పాటు ఏపీకి కూడా కేంద్రం సాయం చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కాగా ఏపీతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం ఈ రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక సాయంతోనే సరిపెట్టింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top