ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం: సోనియా

ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం: సోనియా - Sakshi


సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే - కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య రహస్యం ఒప్పందం ఉందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. అందుకే కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్నాడీఎంకే వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చెన్నై, ఐలాండ్ మైదానంలో గురువారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఇందులో సోనియాగాంధీ, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఒకే వేదిక మీద నుంచి ప్రసంగించారు. డీఎంకే , కాంగ్రెస్‌లు ప్రజాహితాన్ని కాంక్షించే పార్టీలని, తమ ద్వారానే రాష్ర్ట ప్రగతి సాధ్యం అని కరుణానిధి వ్యాఖ్యానించారు. అంతకుముందు పుదుచ్చేరి ప్రచారంలో సోనియాఅక్కడి ఎన్‌ఆర్ కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top