పొలిటీషియన్‌ హోటల్లో ఆరు జంటల అరెస్టు

పొలిటీషియన్‌ హోటల్లో ఆరు జంటల అరెస్టు - Sakshi


ఘజియాబాద్‌: బీఎస్పీ నాయకుడికి చెందిన హోటల్‌లో అభ్యంతరకర పొజిషన్లలో ఉన్న ఆరు యువ జంటలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువ జంటలకు గంటల చొప్పున గడపడానికి రూంలను హోటల్‌ రాయల్‌ప్యాలెస్‌ ఇస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. దీంతో మహిళా పోలీసులు, యాంటీ రోమియో స్క్వాడ్‌లు సంయుక్తంగా హోటల్‌పై రైడింగ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.



రైడింగ్‌లో ఆరు యువ జంటలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. హోటల్‌ బీఎస్పీ లీడర్‌ కమల్‌ జాదవ్‌కు చెందినదిగా వివరించారు. జంటలను విచారించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని వెల్లడించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top