కాంగ్రెస్ ఆదేశాల్ని ధిక్కరించిన థరూర్!
తిరువనంతపురం: కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల్ని ధిక్కరించేందుకు మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం రోజున తిరువనంతపురంలోని బీచ్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నానని థరూర్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
విజింజమ్ బీచ్ చెత్త చెదారంతో నిండిపోయింది. శనివారం 11 గంటలకు స్థానికులతో కలిసి శుభ్రం చేస్తాను అని ట్విటర్ లో పేర్కోన్నారు. ఇటీవల ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన శశిథరూర్ ను అధికార ప్రతినిధి బాధ్యత నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించిన సంగతి తెలిసిందే. అయినా మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకే థరూర్ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
Vizhinjam Beach, a splendid site ruined by filth&garbage, which I will clean w/local residents tomorrow 25/10 at 11am pic.twitter.com/rMywkClikJ
— Shashi Tharoor (@ShashiTharoor) October 24, 2014