ఎన్నికల్లో ఎందుకు ఓడాం?

ఎన్నికల్లో ఎందుకు ఓడాం? - Sakshi


సీనియర్ నేతలతో రాహుల్ సమావేశం

 

 న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతలతో గురువారం రాత్రి సమావేశమయ్యారు. పార్టీ కీలక నేతలు గులాం నబీ ఆజాద్, అంబికాసోనీ, మణిశంకర్ అయ్యర్, జైపాల్‌రెడ్డితో ఫలితాలపై సంభాషించారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని, భవిష్యత్‌లో దాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న దానిపైన చర్చించారు. సీనియర్ నేతలు మాట్లాడుతూ చాలాచోట్ల పార్టీలోని  నాయుకులే విజయానికి సహకరించలేదన్నారు. సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను రాబట్టుకోవడంలో స్థానిక నాయకత్వం విఫలమయిందని కొందరు వివరించారు. ప్రజల్లోకి వెళ్లే పలు కార్యక్రమాలను వెంటనే అమలు చేయాలని రాహుల్ నిర్ణయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top