మోదీది విభజించి-పాలించే విధానం: రాహుల్
తిరువనంతపురం: ప్రధాని మోదీ చేసే ప్రతి కార్యక్రమం వెనక రాజకీయ ఉద్దేశమే ఉంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆరెస్సెస్తో కలసి మోదీ ఎన్నికల సమయంలో హిందువులు, ముస్లింలను విభజించి రాజకీయాలు చేస్తున్నారని సోమవారమిక్కడ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆరోపించారు.
కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరితో ఒకరు ఇమడలేకపోతే.. ఎన్నికలయ్యేంతవరకు ఏకంగా ఉండి.. ఆ తర్వాత కొట్టుకోండి అని పార్టీ కార్యకర్తలకు సూచించారు.