నడిరోడ్డుపై భారీ కొండచిలువ


లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ భారీ కొండచిలువ సంచలనం  సృష్టించింది.  భారీ వర్షాల కారణంగా  భారీ పైథాన్ రోడ్డుపైకి వచ్చింది.   దీంతో మంగళవారం ఉదయం స్థానికంగా అలజడి రేగింది. వాహనదారులు భయాందోళనకు లోనయ్యారు.


మీర్జాపూర్‌లోని లఖానియా దారి వాటర్‌ఫాల్‌కు సమీపంలోని రహదారిపై ఈ పైథాన్‌ ఒక గోడ పక్కన నక్కింది. దీన్నిగమనించిన స్థానికులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.   

కాగా  రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలోకుండపోత  వర్షాలు కురుస్తుండగా, టెంపుల్‌  టౌన్‌  వారణాసి 100 మిల్లీమీటర్ల వర‍్షం నమోదైంది. మరింత వర్షపాతం నమోదుకానుందని అక్కడి వాతావరణశాఖ అంచనా వేసింది.





 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top