లాలూ ప్రసాద్ త్వరగా కోలుకోవాలి: మోడీ
న్యూఢిల్లీ: ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ముంబై ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ త్వరగా కోలుకోవాలి.
లాలూజీ తిరిగి ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ముంబై ఆస్పత్రిలో లాలూ ప్రసాద్ యాదవ్ కు హార్ట్ సర్జరీ జరుగనున్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు