ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం


న్యూఢిల్లీ :  ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ఈ కమిటీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు.


 


ఈ నెల 10న  కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం,  అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ సమావేశమైనట్లు తెలుస్తోంది.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top