ప్రశాంత్ కిశోర్ కు ఝలక్‌

ప్రశాంత్ కిశోర్ కు ఝలక్‌ - Sakshi


న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు నరేంద్ర మోదీ సర్కారు ఝలక్‌ ఇచ్చింది. ఆయన నడుపుతున్న అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంట్ బుల్ గవర్నెన్స్(సీఏజీ)కు ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. గత నాలుగేళ్లకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. సీఏజీ అహ్మదాబాద్ చిరునామాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ ఈ నోటీసులు పంపింది. సీఏజీ అధికారులు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. వార్షిక నివేదికలు, బిల్లులు, ఇన్ వాయిస్, ఖర్చులకు సంబంధించిన వివరాలు, బ్యాంకు స్టేట్ మెంట్స్ సమర్పించాలని సూచించింది.



2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. తర్వాత ఆయన బీజేపీకి దూరమయ్యారు. బిహార్ లో నితీశ్ కుమార్ అధికారం నిలబెట్టుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార వ్యూహకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంపెనీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top