ఐకమత్యమే భారత్ బలం: ప్రణబ్

ఐకమత్యమే భారత్ బలం: ప్రణబ్ - Sakshi


న్యూఢిల్లీ: భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ అప్పగించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఐకమత్యమే భారత్ బలమని చెప్పారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆదివారం రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం ప్రజాస్వామ్యానికి ఓ పరీక్ష అని ప్రణబ్ అన్నారు. ఏ దేశమైనా మహిళలను, మహిళా సాధికారితను గౌరవిస్తేనే అగ్రదేశంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం ఉదయం భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. కాసేపట్లో రాష్ట్రపతి ఒబామాకు విందు ఇవ్వనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top