పరిశ్రమలకు రోజుకు ఐదుగంటల పవర్కట్!

పరిశ్రమలకు రోజుకు ఐదుగంటల పవర్కట్! - Sakshi


విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడం, మరోవైపు సరఫరాలో తీవ్రమైన లోటు ఉండటంతో గురువారం నుంచి విద్యుత్ కోతలు విధించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లకు రోజుకు నాలుగు గంటలు, పరిశ్రమలకు ఐదు గంటల చొప్పున కోత విధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే రాష్ట్ర రాజధాని జైపూర్తోప ఆటు కోటా నగరాన్ని కూడా ఈ కోతల నుంచి మినహాయించారు. గృహ వినియోగదారులకు రోజుకు రెండేసి గంటల చొప్పున రెండుసార్లు, పరిశ్రమలకు ఐదు గంటలు కోత పెడతామన్నారు.



వ్యవసాయ రంగానికి రోజుకు కేవలం ఐదు గంటలు మాత్రమే సరఫరా ఉంటుంది. డిమాండుకు, సరఫరాకు విపరీతమైన తేడా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, వర్షాలు పడితే పరిస్థితి మెరుగుపడొచ్చని విద్యుత్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. రావత్భాటా వద్ద గల 200 మెగావాట్ల రాజస్థాన్ అణువిద్యుత్ కేంద్రం ఒకటి మూతపడింది. దాంతోపాటు ఛాబ్రా థర్మల్ ప్లాంటులోని రెండు 250 మెగావాట్ల యూనిట్లు కూడా మూతపడ్డాయి. దీంతో కోతలు తప్పట్లేదని అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top