కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పేలుడు


జమ్మూ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో మెందర్ సెక్టర్ నియంత్రణ రేఖ వద్ద పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో పోర్టర్ మరణించాడని ఆర్మీ ఉన్నతాధికి వెల్లడించారు. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లతోపాటు మరో పోర్టర్ తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అనంతరం సరిహద్దు రేఖ వెంబడి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించిందని ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top