బాంబు పేలుడులో పోలీసు మృతి

బాంబు పేలుడులో పోలీసు మృతి - Sakshi


కాశ్మర్లోని సొపోర్ పట్టణంలో శనివారం ఉదయం ఓ గ్రెనేడ్ పేలడంతో ఓ పోలీసు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సొపోర్ పట్టణంలో అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసురుతుండగా పోలీసులు వారిని అదుపు చేస్తున్నారని, అంతలో ఉగ్రవాదులు కూడా అక్కడకు చేరుకుని పోలీసులపై గ్రెనేడ్ విసిరారని ఓ పోలీసు అధికారి చెప్పారు.



ఈ పేలుడు వల్ల ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండి, తర్వాత అతడు మరణించాడని తెలిపారు. మిగిలిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన ఇద్దరికి కొద్దిపాటి గాయాలయ్యాయన్నారు. ముస్లింలకు పవిత్రమైన షబ్బే ఖదర్ రాత్రి ఈ దాడి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులంతా రాత్రంతా ప్రార్థనలు జరుపుతున్న సమయంలో ఈ మారణహోమం సంభవించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top