అప్పుడప్పుడూ దర్శనమివ్వడానికి ప్రధాని దేవుడా?

అప్పుడప్పుడూ దర్శనమివ్వడానికి ప్రధాని దేవుడా? - Sakshi


లోక్‌సభలో ఖర్గే విసుర్లు



న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభకు గైర్హాజరవుతున్న వ్యవహారంపై బుధవారం సభలో అధికార, విపక్షాలు చెణుకులు విసురుకున్నాయి. ‘అప్పుడప్పుడూ దర్శనమివ్వడానికి ప్రధాని దేవుడా?’ అని సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించటంతో సభ నవ్వులతో హోరెత్తింది. మోడీ రోజూ కాకున్నా కనీసం వారానికోసారైనా పార్లమెంటుకు ముఖం చూపాలని, బడ్జెట్ చర్చ తర్వాత ఆయన సభకు రానే లేదని ఖర్గే మంగళవారం ఆరోపించారు.



దీనిపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం సభలో మాట్లాడుతూ ‘నిన్న మీరు ఫిర్యాదు చేశారు కనుక ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని ఇక్కడ ఉన్నారు. మీకు ఆయన దర్శనమైంది’ అని వెక్కిరించారు. దీంతో ఖర్గే కూడా మాటకు మాట బదులిచ్చారు.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top