మరో కొత్త అధ్యాయం: మోడీ
న్యూఢిల్లీ: తన జపాన్ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయంగా రూపొందుతుందని ప్రధాని నరేంద్రమోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. తన పర్యటన తర్వాత ఇరుదేశాల భాగస్వామ్యం మరో మెట్టుకు చేరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తన పర్యటనతో ఆసియాలో అతిపురాతన ప్రజస్వామ్య దేశాల్లో కొత్త అధ్యాయంగా రాసే అవకాశం ఉందని మోడీ అన్నారు. జపాన్ పర్యటన కోసం శనివారం మోడీ బయలుదేరనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ, ఆర్ధిక, భద్రత, సాంస్కృతిక రంగాల్లో భారతదేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోందని మోడీ తెలిపారు.