మార్చి 10 నుంచి ప్రధాని విదేశీ పర్యటనలు


ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి10న ఢిల్లీ నుంచి బయలు దేరనున్న ఆయన సీషెల్స్, మారిషస్, శ్రీలంకలో పర్యటించనున్నట్లు విదేశాంగ వ్యవహారాలశాఖ శుక్రవారం తెలిపింది. ఈ ఏడాదిలో ఆయన విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి కానుంది. మార్చి 11న ఆయన సీషెల్స్లో అక్కడి అధ్యక్షుడు జేమ్స్ అలెక్సిస్ మైఖెల్తో ద్వైపాక్షిక సంబంధాలు చర్చిస్తారు. అనంతరం అదే 11, 12న మారిషస్, 13, 14న శ్రీలంకలో ఆయన పర్యటించి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ఇతర సీనియర్ నేతలతో భేటీ అవుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top