రజనీకాంత్కు పారిక్కర్ క్షమాపణ!!

రజనీకాంత్కు పారిక్కర్ క్షమాపణ!! - Sakshi


రక్షణ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్.. దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ పేరు చెప్పడం మర్చిపోయారు. గోవాలో జరిగిన 45వ అంతర్జాతీయ భారత ఫిలిం ఫెస్టివల్కు విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపే సందర్భంలో పలువురి పేర్లను చదివిన పారిక్కర్, అక్కడే ఉన్న రజనీకాంత్ పేరును మాత్రం చదవలేదు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్, గవర్నర్ మృదులా సిన్హా.. ఇలా అందరిపేర్లూ చదివేశారు. కానీ, రజనీకాంత్ పేరు మర్చిపోయారు.



అయితే.. తన తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటున్న పారిక్కర్.. దీన్ని కూడా చిన్న చిరునవ్వుతో సరిదిద్దుకున్నారు. తాను మరికొన్ని పేర్లను కూడా రాసుకున్నాను గానీ, ఆ కాగితాన్ని కింద మర్చిపోయానని, అందులోనే రజనీకాంత్ పేరు కూడా ఉందంటూ క్షమాపణలు చెప్పారు. సినిమాల్లో అరివీర భయంకరంగా కనిపించే రజనీకాంత్.. విడిగా మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటారు. అందుకే.. ఈ సందర్భంలోనూ ఎవరినీ ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా చిన్న చిరునవ్వుతో సరిపెట్టేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top