వెయ్యిమంది ఒకే రోజు పుట్టారట!

వెయ్యిమంది ఒకే రోజు పుట్టారట! - Sakshi


అలహాబాద్‌: ఆ గ్రామంలోని 5వేల మందిలో వెయ్యిమంది పుట్టినరోజు ఒకే తేదీ అట! వారంతా జనవరి 1న పుట్టారని అధికారులు ఆధార్‌ కార్డులు మంజూరు చేశారు. వాటిని అందుకున్న జనం తొలుత ఆశ్చర్యపోయి తర్వాత ఫిర్యాదు చేశారు.


ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ జిల్లా కంజాసాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సాంకేతిక పొరపాటు దీనికి కారణమని అధికారులు తెలిపారు. కార్డులలో తమ అసలు పుట్టిన రోజుకు బదులు జనవరి 1 వచ్చిందంటూ గ్రామంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఫిర్యాదు చేశారని మండల అభివృద్ధి అధికారి నీరజ్‌ దూబే తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ లోటుపాట్ల వల్ల ఇలా జరిగి ఉంటుందని, దర్యాప్తునకు ఆదేశించామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top