ఆకట్టుకుంటున్న నీలగిరి ఫ్రూట్ షో..

ఆకట్టుకుంటున్న నీలగిరి ఫ్రూట్ షో..


కోనూర్: తమిళనాడులోని కూనూరులో 57వ ఫ్రూట్స్ షో అట్టహాసంగా  ప్రారంభమైంది.  ప్రతీ ఏడాది వేసవిలో జరిగే  ప్రదర్శనలో భాగంగా  శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన రెండురోజుల పాటు కొనసాగనుంది. రకరకాల పళ్లతో తయారుచేసిన జంతువుల బొమ్మలు ప్రదర్శనలో కొలువుదీరాయి.  హార్టికల్చర్ విభాగం వన్యప్రాణి సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ  ఏర్పాటచేసిన ఈ షోను నీలగిరి జిల్లా కూనూరులోని సిమీస్ పార్క్లో జిల్లా కలెక్టర్ పి. శంకర్ ప్రారంభించారు.


రకరకాల పళ్లతో, వివిధ ఆకృతులతో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన.. టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ద్రాక్షలు,  ఆరెంజ్, యాపిల్, నిమ్మ, అరటి తదితర  రకారకాల పళ్లతో చేసిన  జంతువుల ఆకృతులు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా ద్రాక్షలతో  చేసిన ఏనుగు, ఆరెంజ్,  నిమ్మ పళ్లతో చేసిన సింహం బొమ్మలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 7  అడుగుల  ఎత్తుతో టోపీ పెట్టుకుని ఉన్న సైనికుని  విగ్రహం, 15 అడుగుల పొడవైన ద్వారం మరింత ఆకట్టుకుంటున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top