బురద్వాన్ పేలుడుపై ఎన్ఐఏ చీఫ్ పర్యవేక్షణ


కోల్కతా : బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్  స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం బురద్వాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శరద్ కుమార్ ... పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.



స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకరుగా గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అక్టోబర్ 13న అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top