నకిలీ కరెన్సీ నోట్ల కేసులో వ్యక్తి అరెస్ట్: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి కేసు(ఎఫ్ఐసీఎన్)లో ఓ వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తి బెంగళూరుకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు.
నిందితుడుని రేపు (ఆదివారం) రిమాండ్కు తరలించనున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. అనంతరం వైజాగ్లోని ఎన్ఐఏ కోర్టుకు హాజరుపరచనున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.