ఆ షాపులో ఏదైనా రూ.10లకే..






నిరుపేదల  అవసరాలకు అనుగుణంగా పంజాబ్‌లోని లూధియానాలో ఓ ఎన్‌జీవో ఏ వస్తువునైనా రూ.10లకే అందిస్తోంది. దుస్తుల నుంచి బూట్లు, బొమ్మలు, నిత్యవసరాలు, ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే ఈ షాపులో దొరికే వస్తువులలో ఎక్కువ మొత్తం సెకండ్‌ హ్యాండ్‌వి. 

 

రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఈ షాపులో వస్తువులు కొనడానికి క్యూ కడుతుంటారు. 2014లో ప్రారంభమైన ఈ ఎన్‌జీవో ఇప్పటివరకు 250 మంది శస్త్రచికిత్సలకు సాయం చేసింది. కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని ఎన్‌జీవో సభ్యుడు ఒకరు తెలిపారు.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top