జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి

జాతీయ గీతంలో ‘అధినాయక్’ను తొలగించాలి


జైపూర్: జాతీయ గీతం ‘జనగణమన’లోని అధినాయక్ పదాన్ని తొలగించాలని రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ డిమాండ్ చేశారు. దాని స్థానంలో ‘మంగళ్’ పదాన్ని చేర్చాలన్నారు. ‘జనగణమన అధినాయక్ జయహో’ వాక్యంలో అధినాయక్ ఎవరని ఆయన  ప్రశ్నించారు. ఆ పదం ఆంగ్లేయుల పాలనను పొగిడేలా ఉందని చెప్పారు.



ఆ వాక్యాన్ని ‘జనగణమన మంగళ్ గాయే’గా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన రాజస్థాన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అయన మాట్లాడారు. ఈ గీతం రాసిన  టాగూరు అంటే తనకు గౌరవమని, అయినా ‘అధినాయక్’ పదాన్ని తీసేయాల్సిందేనని అన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top