తన గురించి ఓ నిజం చెప్పిన నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు సంబంధించిన ఓ నిజం చెప్పారు. ఆయన మంచి విద్యార్థి కాదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తానెప్పుడూ మంచి విద్యార్థిని కాదని, కానీ తనకు ఇప్పుడు అవార్డు అందుకునే అవకాశం వచ్చిందని మోదీ పేర్కొన్నారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ 42 స్నాతకోత్సవానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యవిద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మోదీ ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. వైద్యరంగంలో పరిశోధనలు పెరగాలని ఆయన సూచించారు.
**