కిసాన్ టీవీ చానెల్ను ప్రారంభించిన మోదీ


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దూరదర్శన్ కిసాన్ టీవీ చానెల్ను ప్రారంభించారు. ప్రధానిగా ఏడాది పాలనను పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.



కిసాన్ టీవీ చానెల్ రైతుల కోసం 24 గంటలూ పనిచేస్తుందని మోదీ చెప్పారు. వ్యవసాయం రంగంలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. ఉన్నత విద్య చదువుకున్న యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులవుతున్నారని మోదీ పేర్కొన్నారు. యువత సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top