జమ్మూకాశ్మీర్లో మోడీ దీపావళి వేడుక
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన ముగిసింది. దీపావళి వేడుకలు చేసుకునేందుకు కాశ్మీర్ వెళ్లిన మోడీ గురువారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు.
అంతకుమందు మోడీ భారత సైనికులు, జమ్మూకాశ్మీర్ ప్రజలతో కలసి దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. మోడీ సియాచిన్ను సందర్శించి సైనికులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం శ్రీనగర్ వెళ్లారు. జమ్మూకాశ్మీర్లో వరదల వల్ల ఇటీవల దెబ్బతిన్ని ఇళ్లు, ఆస్పత్రుల నిర్మాణాల కోసం 745 కోట్ల రూపాయలు తక్షణం సాయం ప్రకటించారు. మోడీని పలువురు రాజకీయ ప్రముఖులు కలసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.