నా పుట్టినరోజు వేడుకలు చేయొద్దు: నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్రమోడీ తన తొలి పుట్టినరోజు చేసుకోబోతున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ.. అంటే బుధవారం మోడీ పుట్టినరోజు. ఇందుకోసం బీజేపీ భారీ ఎత్తున దేశవ్యాప్తంగా సంబరాలు చేయడానికి సిద్ధమైంది. అయితే.. అంతలోనే మోడీ పెద్ద బాంబు పేల్చారు. అసలెవరూ తన పుట్టినరోజు సంబరాలు చేయొద్దని, దానికి బదులు అందుకు పెట్టే ఖర్చుతో జమ్ము కాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
''నా పుట్టిన రోజు నాడు రకరకాల కార్యక్రమాలు నిర్వహించాలని నా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆలోచిస్తున్నట్లు నాకు తెలిసింది. అయితే, ఎవరూ నా పుట్టినరోజు వేడుకలు చేయొద్దని కోరుకుంటున్నాను. దానికిబదులు మీ సమయాన్ని, వనరులను జమ్ము కాశ్మీర్లో వరద బాధితులను ఆదుకోడానికి వెచ్చించండి'' అని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇప్పుడు జమ్ము కాశ్మీర్లోని మన సోదర సోదరీమణులను ఆదుకోడానికి నడుం కట్టాల్సిన సమయమని ఆయన మరో ట్వీట్లో చెప్పారు. సాధారణంగా మోడీ ఏదైనా ట్వీట్ చేశారంటే.. అది పార్టీ కార్యకర్తలందరికీ శిలాశాసనం లాంటిదే. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాటు్లు సిద్ధం చేసుకున్నా కూడా.. వాటన్నింటినీ ఇప్పుడు మానుకోవాల్సిందేనంటున్నారు.
I am hearing from different places that friends & well-wishers are planning various programmes & events for my birthday.
— Narendra Modi (@narendramodi) September 14, 2014
My humble request- do not celebrate my birthday. Instead, dedicate yourselves towards relief work in J&K through your time & resources.
— Narendra Modi (@narendramodi) September 14, 2014
The need of the hour is to stand shoulder to shoulder with our sisters and brothers of Jammu and Kashmir.
— Narendra Modi (@narendramodi) September 14, 2014