పోర్చుగల్‌ చేరుకున్న ప్రధాని మోదీ


లిస్బన్‌: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా పోర్చుగల్‌ చేరుకున్నారు. మోదీ శనివారం పోర్చుగల్‌ ప్రధానమంత్రి ఆంటోనియా కోస్టాతో భేటీ కానున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన  25, 26 తేదీల్లో అమెరికా, 27న నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు. 

 

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మంత్రులు, వివిధ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అవుతారు. ఈ మూడు దేశాలతోనూ సంబంధాలు బలోపేతం చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

 

 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top