ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన రైలు


ముంబై: నగరంలో అత్యంత రద్దీగా ఉండే చర్జిగేట్ స్టేషన్.. ఆదివారం మద్యాహ్నం.. పట్టాలపైనే నడవాల్సిన ఓ లోకల్ ట్రైన్ హఠాత్తుగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది.



ఈ ప్రమాదంలో డ్రైవర్, గార్డులతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు గమనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సెలవుదినం కావడంతో భారీ ప్రమాదం తప్పినట్లయిందని రైల్వే అధికారులు చెప్పారు. క్షతగాత్రులకు రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.




Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top