పాలం విమానాశ్రయానికి కలాం పార్థివదేహం

పాలం విమానాశ్రయానికి కలాం పార్థివదేహం - Sakshi


న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు. భారత వాయుసేన విమానంలో గువహటి నుంచి మంగళవారం మధ్యాహ్నం  పాలం విమానాశ్రయానికి తీసుకువచ్చారు. కలాం సోమవారం రాత్రి షిల్లాంగ్లో  గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. .  



రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్, రక్షణమంత్రి మనోహర్ పారీకర్, త్రివిధ దళాధిపతులు పాలెం విమానాశ్రయానికి వెళ్లి కలాం భౌతికకాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. కలాం పార్థివదేహాన్ని పాలెం  విమానాశ్రయం నుంచి టెన్ రాజాజీ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసానికి తరలించనున్నారు.  ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.


కలాం అంత్యక్రియలను బుధవారం ఆయన స్వస్థలం తమిళనాడులోని రామేశ్వరంలో అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు. కలాం కుటుంబ సభ్యుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలాం అంత్యక్రియల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top