సుష్మాపై ప్రధాని ప్రశంసల వర్షం

సుష్మాపై ప్రధాని ప్రశంసల వర్షం - Sakshi


వాషింగ్టన్‌: భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్‌ మీడియాను ప్రభావవంతంగా వాడటంలో సుష్మా స్వరాజ్‌ ముందుంటారని కితాబిచ్చారు.



అమెరికా పర్యటనలో ఉన్న మోదీ సోమవారం అక్కడి భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో సోషల్‌ మీడియా శక్తివంతంగా ఉంది. నేను కూడా సోషల్‌ మీడియాతో కనెక్ట్‌ అయి ఉంటాను. అయితే సోషల్‌ మీడియాను వాడుతూ ఓ శాఖను బలోపేతం చేయడంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ, సుష్మా స్వరాజ్‌ మంచి ఉదాహారణగా నిలిచారు' అన్నారు. ప్రపంచంలోని ఏ మూల నుంచైనా భారతీయులు సమస్యల్లో ఉన్నామని ట్వీట్‌ చేస్తే సుష్మా స్వరాజ్‌ స్పందిస్తారని మోదీ గుర్తుచేశారు. దౌత్యరంగానికి ఆమె మానీవీయ కోణాన్ని ఇచ్చారని మోదీ ప్రశంసించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top