నేటి నుంచి మోదీ గుజరాత్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టులో, బాచౌవ్లో పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. మంగళవారం గాంధీనగర్లో ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏఎఫ్బీడీ) గ్రూప్ వార్షిక సమావేశానికి హాజరవుతారు.
గుండు కొట్టించుకున్న హార్దిక్: మోదీ పర్యటన నేపథ్యంలో పటేల్ రిజ్వరేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, 50 మంది ఆయన అనుచరులు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం గుండు చేయించుకున్నారు. ప్రభుత్వం తమ సామాజిక వర్గంపై అకృత్యాలకు పాల్పడుతోందన్నారు.