నేటి నుంచి మోదీ గుజరాత్‌ పర్యటన

నేటి నుంచి మోదీ గుజరాత్‌ పర్యటన - Sakshi


న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. కచ్‌ జిల్లాలోని కాండ్లా పోర్టులో, బాచౌవ్‌లో పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. మంగళవారం గాంధీనగర్‌లో ఆఫ్రికన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఎఫ్‌బీడీ) గ్రూప్‌ వార్షిక సమావేశానికి హాజరవుతారు.



గుండు కొట్టించుకున్న హార్దిక్‌: మోదీ పర్యటన నేపథ్యంలో పటేల్‌ రిజ్వరేషన్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్, 50 మంది ఆయన అనుచరులు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం గుండు చేయించుకున్నారు. ప్రభుత్వం తమ సామాజిక వర్గంపై అకృత్యాలకు పాల్పడుతోందన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top