బెంగళూరు ఎయిర్షోలో ప్రమాదం
బెంగళూరు ఎయిర్షోలో ప్రమాదం సంభవించింది. విన్యాసాలు చేస్తున్న ఫ్లయింగ్ బుల్స్ బృందానికి చెందిన రెండు విమానాలు ఒకదాంతో ఒకటి రాసుకున్నాయి. దాంతో ఒకదాని రెక్క తెగిపోయి, టైర్లు కూడా పేలిపోయాయి. దాంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
చెక్ రిపబ్లిక్కు చెందిన నలుగురు సభ్యుల బృందానికి రాడ్కా మచోవ్ అనే మహిళా పైలట్ నేతృత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం బెంగళూరులోనే నిర్వహించిన ఎయిర్షోలో కూడా ఈ బృందం ఇలాంటి విన్యాసాలు చేసింది.