గవర్నర్‌ ఫొటోకు క్షీరాభిషేకం


తిరువొత్తియూరు(పుదుచ్చేరి): ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అభివృద్ధి పనులకు ప్రోత్సాహం ఇస్తున్న గవర్నర్‌ కిరణ్‌బేడీ చర్యలకు మద్దతు తెలుపుతూ కొందరు అభిమానులు ఆమె ఫొటోను పాలతో అభిషేకించారు. గవర్నర్‌ చర్యలకు ఓ వైపు నుంచి మద్దతు, మరో వైపు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆమెతో తీవ్ర క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆమెను హిట్లర్‌లా చిత్రీకరించిన బ్యానర్లతో వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది.



ఇందుకు జవాబుగా అన్నట్లు యానాంలోని ఆమె అభిమానులు దుకాణం వీధిలో కిరణ్‌బేడి ఫొటోకు క్షీరాభిషేకం చేసి మద్దతు తెలిపారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇది తెలుసుకున్న కిరణ్‌బేడీ ఇకపై అభివృద్ధి పనులకు ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top