రాజస్థాన్లో భూ ప్రకంపనలు


జైపూర్: రాజస్థాన్లోని గురువారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4 గా నమోదు అయింది. ఈ మేరకు జాతీయ భూకంపం పరిశోధన సంస్థ శుక్రవారం వెల్లడించింది. రాజస్థాన్లోని సికార్లో భూకంప కేంద్రం కనుగొన్నట్లు తెలిపింది. ఈ భూకంపం దాటికి రాజస్థాన్లోని పలు ప్రాంతాలు కంపించాయని అజ్మీర్లోని భూకంప పరిశోధన సంస్థ పేర్కొంది. అయితే ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించలేదని చెప్పింది. ఈ భూకంపం గురువారం రాత్రి 11.27 గంటలకు వచ్చింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top